
మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. మంత్రి పదవి ఆశించిన నేతలు అసమ్మతి స్వరం వినిపించారు. తనకు ఖచ్చితంగా మంత్రిపదవి వస్తుందని ఆశించిన సీనియర్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేంసాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి రాజీనామా యోచన చేశారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు.. అసమ్మతి నేతలతో బుజ్జగించారు. ఉదయమే సుదర్శన్ రెడ్డి ఇంటికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. ఆయనకు హైకమాండ్ నుంచి భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లిన మీనాక్షి నటరాజన్, వివేక్ లు.. అతనితో మాట్లాడి కూల్ చేశారు.
మలక్ పేటలోని మల్ రెడ్డి రంగారెడ్డి ఇంటికి వచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్. హైకమాండ్ మాటగా తన వాదనలు చెప్పారు. మీనాక్షి నటరాజన్ కూడా మల్ రెడ్డి రంగారెడ్డితో మాట్లాడి.. భవిష్యత్ లో న్యాయం చేస్తామనే హామీ ఇచ్చారు. పార్టీ పెద్దలు మాట్లాడటంతో కూలైన మల్ రెడ్డి రంగారెడ్డి.. కీలక ప్రకటన చేశారు. అయితే పదవి త్యాగం చేయడానికి సిద్ధంగానే ఉన్నానని మరోసారి ప్రకటించారు.
Read Also : నేను విన్నాను.. నేను ఉన్నాను – జగన్ డైలాగులు చెప్తున్న కేటీఆర్
తమ మొర అధిష్ఠానం వినలేదన్నారు మల్ రెడ్డి రంగారెడ్డి. పదేళ్ళు BRS తో కోట్లడటం జరిగింది..కార్యకర్తలు లేకుండా మేం పనిచేయలేం..కార్యకర్తల డిమాండ్ మేరకే అడుగుతున్నామని చెప్పారు. పార్టీని కాపాడింది మేమే..పార్టీ లైన్ లోనే ఉంటాం.. పొరపాట్లు చేయవద్దని కోరుతున్నామన్నారు మల్ రెడ్డి రంగారెడ్డి. పార్టీలో కొత్తగా వచ్చినవాళ్ళకు పదవులు ఇస్తే… కార్యకర్తలు బాధపడతారని చెప్పారు. తప్పులు చేయకుండా పార్టీలో లైన్ లో పనిచేయాలి.. వ్యక్తిగత నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. పది ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని.. కాని ఇచ్చిన జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు గతంలో ఆరుగురు మంత్రులు ఉన్నారని.. ఇప్పుడు ఒక్కరు కూడా లేకపోతే ఎలా అని మల్ రెడ్డి ప్రశ్నించారు.
పార్టీ పక్షాన ఉంటాం..అధిష్ఠానం చెప్పడానికి అవకాశం ఇవ్వాలని పిసిసి చీఫ్ ను కోరామన్నారు. పార్టీ బాగోగుల కోసమే చెప్తున్నామని.. మారకపోతే పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందన్నారు.పార్టీకి చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పాను.. నా సామాజిక వర్గమే అడ్డుగా వస్తె… పార్టీ కోసమైనా త్యాగం చేస్తా.. పదవి త్యాగానికి కట్టుబడి ఉన్నానని మల్ రెడ్డి రంగారెడ్డి తేల్చి చెప్పారు.