ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే వర్సెస్‌ మేయర్‌ - కడపలో మళ్లీ కుర్చీలాట... ఈసారి పదవీ గండమే...!

కడపలో రాజకీయం మరోసారి భగ్గుమంటోంది. ఎమ్మెల్యే-మేయర్‌ మధ్య వివాదం… రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎప్పుడు మీటింగ్‌ పెట్టినా… కుర్చీలాట జరుగుతూనే ఉంది. ఇప్పటికే రెండు సార్లు జరిగిన సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై… మేయర్‌ పక్కన కుర్చీ వేయలేదని.. ఆమె గొడవ చేశారు. మేయర్‌, ఎమ్మెల్యే మధ్య ఈ విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇప్పుడు కూడా… మళ్లీ కుర్చీల గొడవే జరిగింది. జనరల్‌ బాడీ మీటింగ్‌ వేళ రచ్చ రచ్చ అయ్యింది. అసలు ఏం జరిగిందే…!

కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మళ్లీ వివాదం రాజుకుంది. సమావేశం కోసం.. సమావేశ మందిరంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. మేయర్‌, కమిషనర్‌తోపాటు కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డికి కుర్చీలు వేశారు. అలాగే ఎమ్మెల్సీలు రాంగోపాల్‌రెడ్డి, రమచంద్రారెడ్డికి కూడా కుర్చీలు వేశారు. వీరి మధ్యలో మేయర్‌ కుర్చీ వేశారు అధికారులు. శుక్రవారం ఉదయం 11గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా.. మేయర్‌, కొందరు కార్పొరేటర్లు రాలేదు. టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాత్రమే ఆమెకు కేటాయించిన కుర్చీలో కూర్చుకున్నారు. అయితే… మేయర్‌ సురేష్‌బాబు సమావేశ మందిరంలో కాకుండా… తన ఛాంబర్‌లోనే సమావేశాన్ని నిర్వహించారు. 38 మంది వైసీపీ సభ్యులు మేయర్‌ ఛాంబర్‌లో సమావేశానికి హాజరయ్యారు.

Read Also : జూనియర్‌ ఎన్టీఆర్‌ని అందుకే దూరం పెట్టాం – నిజాలు బయటపెట్టిన పురందేశ్వరి

ఇదిలా ఉండగా… తనకు తెలియకుండా మీటింగ్‌ హాల్లో సమావేశానికి ఏర్పాట్లు చేయడంపై మేయర్‌ సురేష్‌బాబు భగ్గుమన్నారు. సర్వసభ్య సమావేశం తన ఛాంబర్‌లోనే నిర్వహిస్తానని ముందే… కమిషనర్‌కు లేఖ రాసినట్టు చెప్పారు మేయర్‌. అయినా… తనకు తెలియకుండా సమావేశ మందిరంగా ఏర్పాట్లు చేశారన్నారు. దీనిపై.. టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ఫైరయ్యారు. మేయర్‌ తీరుపై మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా మేయర్‌ సురేష్‌బాబు.. తన ఛాంబర్‌లోనే సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్‌నించారు. ఈ వివాదంతో.. సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. మరోవైపు… కమిషనర్ మనోజ్‌రెడ్డి మేయర్‌ సురేస్‌బాబు ఛాంబర్‌కు నోటీసులు అంటిచారు. 13వ తేదీ ఇచ్చిన నోటీసు ప్రకారం… కౌన్సిల్‌ హాల్లో సమావేశానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఉదయం 11 గంటల సమయంలో మేయర్‌, కార్పొరేటర్లు అందుబాటులో ఉన్నా.. సమావేశానికి ఎందుకు రాలేదని నోటీసుల్లో ప్రశ్నించారు. కోరం లేనందు వల్ల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

Read Also : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. అధికారుల కీలక సూచనలు!

అయితే.. ఇక్కడో సమస్య వచ్చి పడింది. నిబంధనల ప్రకారం కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించి.. ఈనెల 22కు ఆరు నెలలు పూర్తవుతోంది. ఆరు నెలల్లోగా సమావేశం నిర్వహించకపోతే… మేయర్‌తోపాటు కార్పొరేటర్లు పదవులు కోల్పోతారన్న రూల్‌ ఉంది. శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసినా… కోరం లేని కారణంగా వాయిదా వేస్తున్నట్టు కమిషనర్‌ పేరుతో నోటీసులు ఇవ్వడంతో… ప్రస్తుత కడప కార్పొరేషన్‌కు పదవీగండం పొంచిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button