Tuesday, February 17, 2026
HomeజాతీయంMaruti Suzuki: ఎట్టకేలకు EV విభాగంలోకి అడుగుపెట్టిన మారుతీ సుజుకి

Maruti Suzuki: ఎట్టకేలకు EV విభాగంలోకి అడుగుపెట్టిన మారుతీ సుజుకి

Maruti Suzuki: దేశీయ వాహన రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అడుగుపెట్టింది. ఎంతోకాలంగా వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంస్థ తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని మంగళవారం ఘనంగా ఆవిష్కరించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ ఆందోళనలు, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో విద్యుత్ వాహనాల పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ సంస్థ ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా భావిస్తున్నారు.

సంస్థ విడుదల చేసిన ఈ కొత్త వాహనం ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా నిర్ణయించింది. అయితే ఇది ప్రత్యేక చెల్లింపు విధానంపై ఆధారపడి ఉంటుంది. వాహనానికి అవసరమైన బ్యాటరీని వినియోగానికి అనుగుణంగా చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. కిలోమీటర్‌కు రూ.3.99 చొప్పున విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల ప్రారంభ ధర తక్కువగా ఉండటంతో మధ్యతరగతి వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుందని కంపెనీ భావిస్తోంది.

ఈ విద్యుత్ వాహనం 8 సంవత్సరాల బ్యాటరీ హామీతో అందుబాటులో ఉంటుంది. 49 కిలోవాట్ అవర్ మరియు 61 కిలోవాట్ అవర్ సామర్థ్యాలున్న రెండు బ్యాటరీ ఎంపికలు వినియోగదారులకు అందిస్తున్నారు. 49 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 440 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్థ వెల్లడించింది. ఇక 61 కిలోవాట్ అవర్ బ్యాటరీను ఎంచుకుంటే ఒక్కసారి ఛార్జ్‌తో 543 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని పేర్కొంది. దీర్ఘదూర ప్రయాణాలకు కూడా ఈ వాహనం అనుకూలమని అధికారులు తెలిపారు.

వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు సంస్థ అధికారిక వెబ్ సైట్ లేదా విక్రయ కేంద్రాల వద్ద రూ.21 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. త్వరలోనే వినియోగదారులకు వాహనాల సరఫరా ప్రారంభమవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. వేరియంట్‌ల వారీగా పూర్తి ధరల వివరాలను కూడా త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది.

గత సంవత్సరం 8వ నెలలోనే ఈ వాహన ఉత్పత్తిని ప్రారంభించిన సంస్థ, ఏడాది ముగిసే సరికి సుమారు 13 వేల యూనిట్లను 28 దేశాలకు ఎగుమతి చేసినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ వాహనానికి మంచి స్పందన లభిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రవేశం కీలక మలుపుగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Telangana: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments