
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ఎంతోమంది సినిమా ప్రేక్షకులు తమిళ హీరో ధనుష్ మరియు తెలుగు హీరో నాగార్జున నటించిన కుబేర సినిమా కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూశారు. ఈ సినిమా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల థియేటర్లలో పాజిటివ్ టాక్ తో కలకలలాడుతుంది. డైరెక్టర్ శేఖర్ కమల ఈసారి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ మూవీని తీశారు. సినిమా నిడివి కాస్త ఎక్కువ సేపు పాటు ఉండడం వల్ల ప్రేక్షకుల నుండి విమర్శలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ సినిమా ఈ వీకెండ్ లో మంచి విజయం సాధించేలా కనపడుతుందని చాలామంది ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్, తెలుగు స్టార్ హీరో నాగార్జున అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందనా నటించారు. ఈ స్టార్ నటులు అందరికీ కూడా భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా బయట టాక్ వినిపిస్తుంది. కానీ అసలైన రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒకప్పుడు బాల్యవివాహాలు… ఇప్పుడేమో 30 దాటినా పెళ్లిళ్లు కష్టమే!.. ఎందుకిలా?
ఈ కుబేర సినిమాలో హీరోగా నటించిన తమిళ స్టార్ హీరో ధనుష్ ది ఒక బిచ్చగాడి పాత్ర. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఒక బిచ్చగాడిగా ధనుష్.. ఆ పాత్రలో సహజంగా నటించడమే. ఈ చిత్రంలో నటించినందుకు గాను ధనుష్ ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అలాగే తెలుగు స్టార్ హీరో నాగార్జున ఈ సినిమాలో ఒక కీలకపాత్ర పోషించగా అందుకుగా ను 14 కోట్ల మేరా పారితోషకం అందుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంది. అలాగే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారిన దేవిశ్రీప్రసాద్ మూడు కోట్ల మీద పారితోషికం తీసుకున్నారు. ఇక చివరిగా సినిమా కెప్టెన్ శేఖర్ కమ్మల ఐదు కోట్ల పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు పూర్తిగా 100 కోట్లకు పైగానే బడ్జెట్ అవ్వగా సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తుండడంతో పెట్టిన పెట్టుబడి మొత్తానికి భారీగానే లాభం వచ్చేటటువంటి అవకాశం ఉందని అనిపిస్తుంది.