Tuesday, March 24, 2026
Homeరాజకీయం‘జర నన్ను పగబట్టకే’.. అసెంబ్లీలో నవ్వులు పూయించిన మల్లారెడ్డి!

‘జర నన్ను పగబట్టకే’.. అసెంబ్లీలో నవ్వులు పూయించిన మల్లారెడ్డి!

అసెంబ్లీ సమావేశాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి తన ప్రత్యేక శైలిలో ప్రసంగించి సభలో నవ్వులు పూయించారు. ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ దుస్థితిని గట్టిగా ప్రస్తావిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకువచ్చారు. నగరం నలుమూలల నుంచి వచ్చే చెత్తతో ఆ ప్రాంతం పూర్తిగా బాధాకర పరిస్థితిలో ఉందని, అక్కడ నివసించే ప్రజలు రోజూ అసహ్యకర వాతావరణంలో జీవించాల్సి వస్తోందని తెలిపారు. చెత్త నుంచి వస్తున్న దుర్వాసనను భరించడం చాలా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో తాను మేడ్చల్ ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నాననే భావన కలుగుతోందని సభలో వ్యాఖ్యానిస్తూ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు జవహర్‌నగర్ ప్రాంతాన్ని ప్రత్యేక విభాగంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “శ్రీధరన్న.. నన్ను జర పగ బట్టకే.. మా జిల్లాకు మీరు బాధ్యత వహిస్తున్నారుగా, మా సమస్యలను తప్పకుండా పరిష్కరించాలి” అంటూ చమత్కారంగా మాట్లాడారు. జవహర్‌నగర్ సమస్యను త్వరగా పరిష్కరించడమే కాకుండా, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మొత్తంగా తన ప్రసంగంలో సమస్యలను స్పష్టంగా వివరించడంతో పాటు, తన హాస్య శైలితో సభను ఆకట్టుకోవడంలో మల్లారెడ్డి మరోసారి విజయవంతమయ్యారు.

ALSO READ: ఓరి దేవుడో!.. ఏనుగులు పగబడతాయా?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments