
కడప గడ్డ… వైఎస్ కుటుంబం అడ్డా. ఇది ఒకప్పటి మాట అని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. మహానాడును విజయవంతంగా నిర్వహించి… కడప.. టీడీపీ ఖిల్లా అని నిరూపించామని చెప్తున్నారు. మహానాడు సూపర్ సక్సెస్ కావడంతో… సంతోషంలో మునిగిపోయింది తెలుగుదేశం పార్టీ. మరోవైపు… వైసీపీ మాత్రం కడప ఎప్పటికీ జగన్ అడ్డానే అని బలగుద్ది చెప్తోంది.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా… ఏటా మూడు రోజులు మహానాడు నిర్వహించడం టీడీపీ సాంప్రదాయం. అయితే… ప్రత్యర్థుల డామినేషన్ ఉన్న కడపలో మహానాడు పెట్టడం.. సాహసోపేత నిర్ణయం. టీడీపీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ కడపలో మహానాడు నిర్వహించారు. మొదట… వైనాట్ పులివెందుల అనుకున్నా.. చివరికి కడప ఫిక్స్ చేశారు. మొదటి నుంచి వ్యూహాత్మకంగా… పక్కా ప్లాన్ ప్రకారం… ఈ మహానాడును ఆర్గనైజ్ చేశారు. రోటీన్కు భిన్నంగా ప్రోగ్రామ్స్ పెట్టారు. ఈసారి టెక్నాలజీని కూడా వాడుకున్నారు. మామూలుగా… మహానాడు అంటే నేతల ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలే ఉండేది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మెప్పు కోసం ఆయన్ను పొగుడుతూ గంటలు గంటలు ప్రసంగిచేవారు పార్టీ నేతలు. కానీ… ఈసారి అలాంటివి లేవు. చంద్రబాబు, లోకేష్ కూడా.. మహానాడు అజెండాకు కట్టుబడి ఉన్నారు.
మహానాడు నిర్వహణ మొత్తం లోకేష్ టీమ్దే. ఎక్కడా పొరపాట్లు జరగకుండా… అధికారులు, పోలీసులు, వాలంటీర్లను సమన్వయం చేసుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాకి టాకీలు, డ్రోన్ల సాయంతో ఎక్కడా సమస్య ఉన్నా… వెంటనే పరిష్కరించారు. రిటీన్కు భిన్నంగా… ఎన్టీఆర్ ఫొటో గ్యాలరీని.. ఈ సారి డిజిటర్ గ్యాలరీగా ఏర్పాటు చేశారు.
మహానాడులో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకున్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూనే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు, లోకేష్. ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్.. వైసీపీని టెన్షన్ పెడుతోంది. మహానాడు ముగింపు స్పీచ్లో వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఏపీలో ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్స్ దోచుకున్నారని ఆరోపించారు. కొండలు మింగేశారు.. చెరువు చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి పనిపడతామన్నారు చంద్రబాబు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో వారిని రాజకీయాల్లోనే లేకుండా చేస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఈ వార్నింగ్ ఎవరికి…? వైఎస్ జగన్కేనా..? అన్న టెన్షన్ వైసీపీలో మొదలైంది. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటున్న చంద్రబాబు ఏం చేయబోతున్నారు..? అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.
ఇక… మంత్రి నారా లోకేష్ కూడా వైసీపీని అటాక్ చేశారు. రెడ్బుక్ కాదు.. రెడ్ కలర్ చూసినా.. వైసీపీ నేతలకు నిద్ర పట్టడంలేదని అన్నారాయన. తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేసింది ఎవరు..? బాబాయ్ను చంపేసింది ఎవరూ..? అంటూ ప్రశ్నించారు. అధికారం ఉందని విర్రవీగి… గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు లోకేష్. మూడు పార్టీలు కలిసున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం కామనే అని… ఎవరూ ఇగోలకు పోవద్దని చెప్పారు.
ఫైనల్గా.. మహానాడు విజయవంతమైంది. కడప ఖిల్లాలో పసుపు జెండాలు రెపరెపలాడాయి. 29 ఎన్నికల సమరశంఖాన్ని ఇప్పుడే పూరించినంత ఉత్సాహంగా ఉన్నారు టీడీపీ శ్రేణులు.