
మీకు వాహనం ఉందా.. కారు, బైక్ ఉందా.. అయితే వెంటనే పెట్రోల్, డీజిల్ భారీగా కొనుగోలు చేసి పెట్టుకోండి.. వంట గ్యాస్ ఏడాది వరకు వచ్చేలా స్టాక్ ఉండేలా చూసుకోండి.. ఎందుకంటే త్వరలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది.. ఒకవేళ ఎక్కడైనా దొరికినా ధరలు మాత్రం భారీగా ఉండనున్నాయి.
ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఒక దశలో ఐదు నెలల గరిష్ఠాన్ని చమురు ధరలు తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. నేటి ట్రేడింగ్లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7శాతం పెరిగి 79.12 డాలర్లను చేరింది. అటు యూఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8 శాతం ఎగబాకి 75.98 డాలర్లకు చేరింది.
ఇక, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 0.7శాతం మేర కుంగాయి. ఈ ప్రభావం భారత మార్కెట్ల పైనా పడింది. సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.1శాతం తగ్గి 3,363 డాలర్లుగా ఉంది.
అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో హర్మూజ్ జల మార్గాన్ని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాలు భారత్కు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు.