
Middle East Crisis: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా తమ దేశంపై దాడులు చేస్తున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి మోడీకి ఇరాన్ అధ్యక్షుడు పేజేష్కియాన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోడీకి ఆయన వివరించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ సంభాషణ కొనసాగింది. ఈ సందర్భంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు దాడులకు ఫుల్ స్టాఫ్ పెట్టాలని సూచించారు. దౌత్య మార్గాలు, చర్చల ద్వారానే మిడిల్ ఈస్ట్ లో శాంతి నెలకొల్పాలన్నారు. భద్రత, సుస్థిరతను స్థాపించాని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్టుపెట్టారు. ఇరాన్ అధ్యక్షుడుతో ఫోస్ సంభాషణ గురించి అధికారికంగా వెల్లడించారు.
ఇరాన్ పై దాడిని ఖండించిన ఐరాస
అటు ఇరాన్ మీద అమెరికా దాడులు చేయడాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రెటరీ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తీవ్ర ఆందోళనలు నెలకొంటున్న ప్రాంతంలో అమెరికా దాడుల చేయడం వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు కలుగుతుందని అభిప్రాయపడింది. దాడులు పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అటు అమెరికా దాడుల నేపథ్యంలో ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ దగ్గర ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధినేత రాఫెల్ గ్రాసీ వెల్లడించారు. మరోవైపు ఇరాన్ పై అమెరికా దాడిని పాకిస్థాన్ తప్పుబట్టింది. తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్ కు ఉందని తేల్చిచెప్పింది. రష్యా సైతం అమెరికా దాడులను ఖండించింది. ఇరాన్ కు అణు ఆయుధాలు సరఫరా చేసే దేశాలు చాలా ఉన్నాయని ప్రకటించింది.