
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్ : దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన భారత జవాన్లకు సంఘీభావంగా, “సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ” ఆధ్వర్యంలో నేడు ఎల్.బి నగర్ నియోజకవర్గంలో భారీగా తిరంగ ర్యాలీ నిర్వహించనున్నారు.
సాయంత్రం 5:00 గంటలకు దిల్షుక్ నగర్ నుంచి కొత్తపేట్ అష్టలక్ష్మీ టెంపుల్ కమాన్ వరకూ ఈ ర్యాలీ సాగింది. “ఓపరేషన్ సింధూర్”ను విజయవంతంగా అమలు చేసి దేశాన్ని గర్వపడేలా చేసిన భారత సైనికుల స్ఫూర్తి సమర్పణకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మాజీ జవాన్లు, కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు, యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు, షాప్ యజమానులు, హిందూ బంధువులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ “దేశాన్ని రక్షించే జవాన్లను గౌరవించడం మన బాధ్యత. భారత ప్రధాని మోడీ దేశ భద్రత అగ్ర ప్రాధాన్యం. ఈ సందేశాన్ని ప్రతి పౌరుడు గుండెల్లో వేసుకోవాలి. మద్దతుగా నిలవాలి,” భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.