
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- టీడీపీ అధినేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడుని అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు వెళ్లిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ దెబ్బకి రాష్ట్రంలో తరువాత జరిగిన ఎన్నికలలో… కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం పట్ల ప్రజలలో వైసిపి పాలనపై భయాందోళనకు గురయ్యారు. దీని ఫలితంగానే ప్రజలందరూ కూడా కూటమి పార్టీలకు ఓట్లు వేసి రికార్డు మెజారిటీని సృష్టించారు.
అయితే వైసిపి కీలక నేత, పార్టీ సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి తలుచుకుని ఉంటే చంద్రబాబును రెండోసారి కూడా అరెస్టు చేసి జైలుకు పంపించే వారిని అన్నారు. చంద్రబాబు నాయుడు లాగా మేము కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదని ఆరోపించారు. తాజాగా అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయినటువంటి వైసీపీ కీలక నేత, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం నెల్లూరు జైల్లో కలిశారు. అనంతరం జైలు బయటకు వచ్చి మీడియాతో జరిగిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి కక్షపూరిత రాజకీయాల జోలికి వెళ్లలేదని అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం వైసిపి కీలక నేతలపై కావాలనే అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఏదో ఒక రూపంలో వేధించి వారిపై కేసులు పెట్టి… రాజకీయంగా బలహీనపరిచేలా చేయడమే కూటమి లక్ష్యంగా సాగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములపై “ముసుగు కబ్జాలు”…రెవెన్యూలోనే దుర్మార్గం..?
ఫుడ్ బదులు డ్రగ్స్ సప్లయ్ – అది కూడా హైదరాబాద్లోని ఓ దాబాలో..!