
-783 మందికి నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్:- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో మరో ముఖ్య దశ చేరుకోనుంది. ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వం గ్రూప్–2 నియామక పత్రాలను అందజేయనుంది. హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కొత్తగా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకున్న ఉద్యోగ భర్తీ ప్రక్రియ వేగవంతం చర్యల్లో భాగంగా ఈ నియామకం జరుగుతోంది. టీఎస్పీఎస్సీ (Telangana State Public Service Commission) ద్వారా గతంలో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలలో ఎంపికైన అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.
Read also : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన హామీ ప్రకారం ఉద్యోగ నియామకాలలో ఆలస్యం ఉండదు, పారదర్శకతతో నియామకాలు చేస్తాం అని పేర్కొన్నారు. ఈ వేడుక ఆ దిశగా మరో ముందడుగుగా భావిస్తున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు, ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి, టీఎస్పీఎస్సీ చైర్మన్, మరియు పలు శాఖల మంత్రులు పాల్గొననున్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులను ప్రభుత్వ సేవలో సమర్థంగా పని చేయాలని సీఎం సూచించనున్నట్లు తెలిసింది.
Read also : మోడీ పర్యటన ఎఫెక్ట్… రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!