గండిపేట,క్రైమ్ మిర్రర్:- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జన్మదినం సందర్భంగా శామీర్పేట్లోని వారి నివాసంలో కిస్మత్పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు నీరుడు శేఖర్ముదిరాజ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జీ తోకల శ్రీనివాస్రెడ్డిలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శేఖర్ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు ఈటల రాజేందర్ ఆయురారోగ్యాలు, ధీర్ఘయుష్షుకలగాలని ఆకాంక్షిస్తూ, ప్రజా సేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ బీజేపీ అధ్యక్షులు మహేష్యాదవ్, ఉపాధ్యక్షులు నరేష్యాదవ్, పవన్సాయి, ప్రేమ్కుమార్, ఈగ లక్ష్మణ్, ప్రవీణ్గౌడ్, నిరుడు కిరణ్, గణేష్, సాయియాదవ్, సందీప్యాదవ్, గంగని అరుణ్, హర్షవర్ధన్రెడ్డి, సాయిరెడ్డి, ఉదయ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మంజీరా నదిలో కాలుష్యంతో చేపలు మృతి.. సిపిఎం ఆగ్రహం
YSRCP Strategy: వైసిపి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్, పాత సన్నిహితుడినే ఆశ్రయించిన జగన్!
