
పదో తరగతి బాలిక.. ఎంత పైశాచికంగా ప్రవర్తించిందో. ప్రేమ కోసం… కన్నతల్లిని దారుణంగా చంపేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. ఎక్కడ బతికిపోతుందో అని… సుత్తితో తలపై కొట్టికొట్టి ప్రాణం తీసేసింది. 16ఏళ్ల వయస్సులో ఎంత కరస్కం… ఎంత పైశాచికం. కనిపెంచిన తల్లి ప్రేమ… 8 నెలల క్రితం పరిచమైన అబ్బాయి ప్రేమ ముందు బతకలేకపోయింది. ఏంటీ ఘాతుకం. రెండు పదుల వయస్సు కూడా లేని బాలికకు.. ఇంత క్రిమినల్ మైండా…? ఈ సమాజం ఎటు పోతోంది.
బంధం భారమవుతుందా…? కామం తలకెక్కుతోందా..? ప్రేమ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారా…? హనీమూన్ కోసమని తీసుకెళ్లి.. ఓ యువతి భర్తనే చంపేసింది. మరో యువతి… ప్రియుడితో ఉండాలని… భర్తను సుపారీ గ్యాంగ్తో చంపించింది. ఇప్పుడు… పట్టుమని 16ఏళ్లు లేని బాలిక… ప్రియుడితో కలిసి కన్నతల్లినే కాటికి పంపేసింది. ఇవన్నీ చూస్తే… ఈ సమావేశం ఎటు వెళ్తుందో అన్న భయం కనిపిస్తోంది.
కన్న కూతులు తల్లినే దారుణంగా చంపిన ఘటన హైదరాబాద్లోనే జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు అంజలి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జీడిమెట్లలో ఉంటోంది. ఆమె పెద్ద కూతురు పదో తరగతి చదువుతోంది. 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఆ బాలికకు నల్లగొండకు చెందిన శివ అనే యువకుడు పరిచమయ్యాడు. చనువుగా మాట్లాడుకున్నారు. ఇద్దరు మధ్య ప్రేమ ముదిరింది. తల్లికి విషయం తెలిసి.. మందలించింది. దీంతో… వారం క్రితం శివతో వెళ్లిపోయింది బాలిక. దీంతో.. కిడ్నాప్ కేసు పెట్టింది తల్లి అంజలి. మూడు రోజుల తర్వాత పోలీసులు బాలికను వెతికి తెచ్చి తల్లికి అప్పగించారు. ఆ కోపం మనసులో పెట్టుకుంది. తన ప్రేమకు అమ్మే అడ్డుగా ఉందని మండిపోయింది. కన్న తల్లిని చంపేయాలని ప్లాన్ చేసింది. ఆ క్రమంలో నల్లగొండ నుంచి ప్రియుడ్ని పిలిపించింది.
సోమవారం సాయంత్రం అంజలి ఇంట్లో పూజ చేసుకుంటోంది. ఆ సమయంలో శివ, తన తమ్ముడితో కలిసి ఇంట్లోకి వెళ్లాడు. చున్నీ తీసుకుని వెనక నుంచి అంజలి గొంతు బిగించాడు. ఊపిరాడకుండా చేశాడు. ఆమె కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నా వదల్లేదు. కాసేపటికి ఆమె కదలకుండా పడిపోయింది. చనిపోయిందనుకుని శివ వెళ్లిపోయాడు. పెద్ద కూతురు కూడా అలాగే అనుకుంది. ఇంతలో చిన్న కూతురు ట్యూషన్ నుంచి ఇంటి వస్తోంది. అది గమనించి బాలిక… బయటే చెల్లిని ఆపేసింది. అమ్మ పక్కనున్న ఆంటో వాళ్ల ఇంటికి వెళ్లమని చెప్పిందంటూ అక్కడికి తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చారు. తల్లి కిచెన్లో పడి ఉంటం చిన్న కూతురు చూసింది. ఏమైందని అడిగితే.. ఏమో తెలీదు… ఎవరైనా నీ ఫ్రెండ్స్ని తీసుకురా అని చెప్పి చెల్లిని పంపేసిందట. అప్పటికి అమ్మ అంజలి చినిపోయిందని పెద్ద కూతురు అనుకుంది. కానీ.. ఆమె కొన ఊపిరి ఉందని తెలుసుకుని వణికిపోయింది. తల్లి అంజలి బతికుంటే తమకు ప్రమాదం అనుకుని… మళ్లీ శివను పిలిపించింది బాలిక. శివ, అతని తమ్ముడు యశ్వంత్ వచ్చారు. సుత్తితో కొట్టమని.. ఇంట్లో ఉన్న సుత్తి తెచ్చి శివకు ఇచ్చింది బాలిక. ఆ సుత్తి తీసుకుని అంజలి తలపై, శరీరంపై పదే పదే కొట్టాడు శివ. దీంతో.. అంజలి కొన ఊపిరి పోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. ఆ సమయంలో చెల్లెలు ప్రియ వచ్చింది. ఇంట్లోకి వెళ్లే సరికి తల్లి రక్తపుమడుగులో పడి ఉందని తెలిపింది. దగ్గరకు వెళ్లి లేపే ప్రయత్నం చేస్తే… అమ్మ చనిపోయిందని.. లేపి వేస్ట్ అని అక్క చెప్పిందని చెప్తోంది చెల్లి ప్రియ. ఆ చిన్నారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.