క్రైమ్ మిర్రర్, మాడులపల్లి ప్రతినిధి: నల్గొండ జిల్లా పంచాయితీ అధికారి ఆదేశాల మేరకు మాడులపల్లి మండలము ప్రజాపరిషిత్ అధికారి(MPDO) జి.వంశీధర్ అధ్యక్షతన నూతనముగా ఎన్నిక కాబడిన గ్రామా పంచాయితీ వార్డ్ మెంబర్ లకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మండలము పరిధిలోని గ్రామాలను రెండు గ్రూపులుగా విభజించారు.మొదటి గ్రూప్ లో 13 గ్రామాలు, రెండో గ్రూప్ లో 14 గ్రామాలుగా విభజించారు. మొదటి గ్రూప్ తేది:16.02.2026 నుండి 20.02.2026 వరకు రెండొవ బ్యాచ్ తేది:23.02.2026 నుండి 27.02.2026 వరకు నిర్వహిస్తున్నారు. ఐయితే సోమవారం(ఫిబ్రవరి 16) మొదటి బ్యాచ్ లో 13 గ్రామాలు
1 ఆగమోత్కూర్,
2 భీమానపల్లి,
3 బొమ్మకల్,
4 చిరుమర్తి,
5 గండ్రవని గూడెం,
6 గుర్రప్పగూడెం,
7 ఇసకబాయి గూడెం,
8 కాల్వలపాలెం,
9 కుక్కడం,
10 పాములాపహాడ్,
11 పోరెడ్డిగూడెం,
12 సీత్య తండా,
13 తోపుచర్ల లకు MRC బిల్డింగ్ మాడులపల్లి నందు ఉదయం 9.00 గం.ల నుండి సాయంత్రము 5.00 గం.ల వరకు ToT (Trainng of Trainers) యస్.వినయ్ కుమార్, వి.శివ, పి దుర్గయ్య మరియు జి. సతీష్ లతో శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరిగినది. ఇట్టి కార్యక్రమము నందు మండల ట్రైనర్ లింగా రెడ్డి గారు , MPO T.సంగీత గారు పాల్గొన్నారు.
