
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కవిత కారు పార్టీని కటీఫ్ చెప్పేసినట్టేనా…? తెలంగాణ జాగృతి పేరుతో సొంత కార్యాచరణ ప్రకటించిన ఆమె… బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్నట్టు డైరెక్ట్గా చెప్పకపోయినా.. వెనుక ఉద్దేశం అదే అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే… జాగృతి మరో కన్ను అన్న ఆమె మాటల వెనుక అర్థమేంటి..? బీఆర్ఎస్ కేటీఆర్ది.. జాగృతి తనది.. ఇద్దరు బిడ్డలు.. కేసీఆర్కు రెండు కళ్లు అని చెప్పకనే చెప్పారా..? అసలు కవిత భవిష్యత్ ప్లాన్ ఏంటి…?
కారు పార్టీలో కవిత రేపిన కల్లోలం… టెన్షన్ పెడుతూనే ఉంది. తెలంగాణ జాగృతి పేరుతో ముందుకొచ్చారు కవిత. హైదరాబాద్లోని బంజారాహిల్స్తో తన ఇంటి పక్కన తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకున్నారు. తెలంగాణ జాగృతిని బీఆర్ఎస్కు అనుబంధంగా కాదు.. సమాంతరంగా నడపబోతున్నారు కవిత. ఒక రాజకీయ పార్టీలానే… తెలంగాణ జాగృతిలోనూ బీసీ, మైనార్టీ, విద్యార్థి, మహిళా విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే.. బీఆర్ఎస్ను నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టకుండా… బీఆర్ఎస్లో ఉంటూనే సొంత ఎజెండాతో ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.
తెలంగాణ జాగృతి పేరుతో తొలి కార్యాచరణ కూడా ప్రకటించారు కవిత. కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించారామె. కాళేశ్వరం కమిషన్.. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ఉద్యమిస్తున్నామని ప్రకటించారు. జూన్ 4వ తేదీన మహాధర్నాకు పిలుపునిచ్చారు కవిత. కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. మహాధర్నాలో కాళేశ్వరం గురించి వాస్తవాలన్నీ ప్రజలకు వివరిస్తామన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రను కూడా బయటపెడతామన్నారు.
కాంగ్రెస్, బీజేపీని దుమ్ము దులిపేశారు. బీసీ బిల్లు విషయంలో కేంద్రానికి కూడా హెచ్చరికలు పంపారు. బీసీ బిల్లును కోల్డ్ స్టోరేజీలో పెడితే ఊరుకోమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు బీసీల రిజర్వేషన్లు అమల్లోకి రావాలన్నారు కవిత. అంతేకాదు… తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న పథకాలను.. నాయకుల పేర్లు కాదు.. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై కూడా ఆమె ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి.. చంద్రబాబు గులాం గిరీ చేస్తున్నారని ఫైరయ్యారు. పోలవరం-బనచర్లతో నీళ్లను ఏపీ తరలించుకోవాలని అనుకుంటుంటే… రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారామె. కవిత.. వేరే పార్టీలో చేరబోతున్నారన్న వార్తలకు కూడా చెక్ పెట్టారామె. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేసి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మొత్తంగా… బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే పార్టీతోపాటు కుటుంబ పరువు పోతుందని సరికొత్తగా ఆలోచించారు కవిత. అధికారికంగా బీఆర్ఎస్ను వీడకుండా…. తన దారి తాను చూసుకున్నారు. తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేసి… బీఆర్ఎస్తో సంబంధం లేకుండా.. సొంత ఎజెండాతో ముందుకు పోతున్నారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా.. కవిత ఇంటి దగ్గర కొత్త ఫ్లెక్సీలు కూడా కనిపించాయి. ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడా గులాబీ ఫ్లేవర్ లేదు. తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసులోనూ ఏర్పాటు చేసిన బ్యానర్లోనూ కేసీఆర్, ప్రొ.జయశంకర్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. అంటే.. కవిత సొంత అజెండాతో.. ముందుకు వెళ్తోందని స్పష్టమవుతోంది.