HomeతెలంగాణTelangana: హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన...!

Telangana: హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు జోన్-II (Zone-II) నూతన భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం రోజున శంకుస్థాపన జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రాజేంద్రనగర్‌లోని బుద్వెల్‌లో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ నూతన హైకోర్టు సముదాయాన్ని నిర్మిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు. ఈ జోన్ సుమారు 60 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో న్యాయమూర్తుల నివాస విల్లాలు (సుమారు 60), సెంట్రల్ రికార్డ్ రూమ్ మరియు ఇతర అనుబంధ భవనాలు ఉంటాయి.

ఈ నిర్మాణ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు ₹2,583 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గతంలో, మార్చి 27, 2024న జోన్-I భవనాల (ప్రధాన కోర్టు భవనం మరియు కార్యాలయాలు) నిర్మాణానికి శంకుస్థాపన జరిగి, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments