పంట‌ నమోదుకు రైతులు సహకరించాలి

ఏఈఓ విన‌య్ కుమార్‌

పెద్దపల్లి, క్రైం మిర్ర‌ర్ః
రైతులంద‌రూ యాసంగి పంట‌ల న‌మోదుకు రైతులు స‌కాలంలో వ‌చ్చి స‌హ‌క‌రించాల‌ని ఏఈవో విన‌య్ కుమార్ కోరారు.

రైతులు సాగు చేసిన పంట‌ల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలిస్తూ న‌మోదు చేసుకుంటున్నామ‌ని తెలిపారు.

ఇందులో భాగంగా గత మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో నమోదు కార్యక్రమం పూర్తి చేసుకొని శుక్రవారం పట్టణoలోని చందపల్లి పాత గ్రామ పంచాయతీ బస్తీ దవాఖాన వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు.

న‌మోదు వ‌ల్ల క‌లిగే లాభాలు రైతుల‌కువివ‌రించారు.. అలాగే మక్క పంట వేసిన రైతులు, పంట ను మార్చిన రైతులు ఇంకా ఎవరైనా నమోదు ఉంటే వచ్చి చేసుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button