Tuesday, March 10, 2026
Homeతెలంగాణవిచారణ పేరుతో డ్రామాలు చేస్తున్నారు : కేటీఆర్

విచారణ పేరుతో డ్రామాలు చేస్తున్నారు : కేటీఆర్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రాజకీయ జీవితంలో పొరపాటున కూడా ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు అని కేటీఆర్ తెలిపారు. 2015వ సంవత్సరంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమేమి చేశామో ప్రతి ఒక్కరికి తెలుసు అని.. ఆనాటి కాలంలోనే మా ఎమ్మెల్యే లందరినీ కూడా కొనేందుకు 50 లక్షల రూపాయలతో వచ్చినటువంటి ఒక దొంగను పట్టుకున్నాము అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ దొంగనే ఏకంగా సీఎం అయ్యాడు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇన్ని నోటీసులు ఇచ్చినా కూడా మేము భయపడేది లేదు అని.. కేవలం నోటీసులు ఇస్తేనే భయపడతాము అని అతను భావిస్తున్నాడు అనుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేము ఎటువంటి తప్పు చేయనప్పుడు పోలీసుల ముందు హాజరవ్వడానికి కూడా మాకు ఎలాంటి సమస్య లేదు అని తెలిపారు.

Read also : కుటుంబాలను నాశనం చేస్తున్న అక్రమ సంబంధాలు..!

Read also : ఇవాళ వసంత పంచమి.. ఈ పనులు అస్సలు చేయకండి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments