Homeరాజకీయంకేరళ ఎన్నికల బరిలో ఎంతమంది నేరస్థులు ఉన్నారో తెలుసా?

కేరళ ఎన్నికల బరిలో ఎంతమంది నేరస్థులు ఉన్నారో తెలుసా?

కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాష్ట్రంలో రాజకీయ ప్రచారం ఘనంగా జరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో సుమారు 38 శాతం తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించగా, 39 శాతం అభ్యర్థులు కోటీశ్వరులవే అని పేర్కొంది.

ఏడీఆర్ ఈసారి 863 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించింది. వీరిలో 324 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదవగా, వాటిలో 201 మంది తీవ్రమైన నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2021 ఎన్నికలతో పోలిస్తే, ఈసారి తీవ్ర నేరాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడయింది.

ప్రధాన రాజకీయ పార్టీలలో కూడా క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాంగ్రెస్‌లో 85 మంది అభ్యర్థుల్లో 72 మందిపై, బీజేపీ‌లో 93 మంది అభ్యర్థుల్లో 59 మందిపై, సీపీఐ(ఎం) లో 77 మంది అభ్యర్థుల్లో 51 మందిపై, ఐయూఎంఎల్ 25 మంది అభ్యర్థుల్లో 21 మందిపై, సీపీఐ 24 మంది అభ్యర్థుల్లో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

తీవ్రమైన నేరాల విషయంలో.. కాంగ్రెస్ నుండి 60 మంది, బీజేపీ నుండి 39 మంది, సీపీఐ(ఎం) నుండి 21 మంది, ఐయూఎంఎల్ నుండి 13 మంది, సీపీఐ నుండి 2 మంది అభ్యర్థులు తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు 15 మంది అభ్యర్థులపై నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అదేవిధంగా, నలుగురు హత్య ఆరోపణలు, 13 మంది హత్యాయత్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ADR నివేదికలో సుప్రీంకోర్టు ఆదేశాలను రాజకీయ పార్టీలు పెద్దగా పాటించలేదని విమర్శించారు. 2020 ఫిబ్రవరి 13 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం, నేర చరిత్ర లేని అభ్యర్థులను పూర్వగమనాన్ని తెలియజేసి ఎంపిక చేయాలని, నేర చరిత్ర ఉన్నవారికి అవకాశం ఇచ్చే సందర్భంలో గట్టి కారణాలు వెల్లడించాల్సిందని సూచించింది. అయినప్పటికీ, పార్టీలు మాత్రం ‘ప్రజాదరణ’ లేదా ‘సామాజిక సేవ’ వంటి కారణాలను చూపుతూ తమ నిర్ణయాలను సమర్థించుకోవడం మాత్రమే జరుపుతున్నాయి. ADR ఈ విధానాన్ని సరైన, సహేతుకమైన కారణంగా పరిగణించలేమని స్పష్టంచేసింది.

ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే.. 863 మంది అభ్యర్థులలో 339 మంది కోటీశ్వరులుగా నిలిచారు. వీరిలో కాంగ్రెస్ నుండి 61 మంది, బీజేపీ, సీపీఐ(ఎం) నుండి 52 మంది, ఐయూఎంఎల్ 21 మంది, సీపీఐ 12 మంది అభ్యర్థులు కోటి రూపాయలకుపైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. మొత్తం అభ్యర్థుల ఆస్తుల విలువ రూ.2,403 కోట్లు. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.2.78 కోట్లుగా ఉండగా, ఇది 2021 ఎన్నికల సగటు రూ.1.69 కోట్ల కంటే గణనీయంగా ఎక్కువ. ADR నివేదికలో, ఎన్నికలలో ధనబలం, నేర చరిత్ర ప్రభావం క్రమంగా పెరుగుతోందని పేర్కొంది.

కేరళ శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 9న ఒకే విడతలో జరగనుండగా, ఫలితాలు మే 4న ప్రకటించబడ్డాయి. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని ప్రధాన పార్టీలు అధికారాన్ని సాధించడానికి తీవ్రంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి.

ALSO READ: ఇలాంటి పనులు చేస్తే రేషన్ కార్డు కట్

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments