చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ నేతలకు, కార్యకర్తలకు సీఎం సూచన

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న అలజడిపై స్పందించారు. వైసీపీ నేతలు అయినటువంటి అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ట్రాప్ లో పడితే వారికి మనకు తేడా ఉండదు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలజడులు నెలకొన్నవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలి అని సూచించారు. పుట్టుకతోనే హింస, అవినీతి, విధ్వంసం పునాదులతోనే వైసీపీ పార్టీ పుట్టింది అని సీఎం చంద్రబాబు నాయుడు వైసిపి పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలజడులు సృష్టించేందుకు, పాపాలను పక్కదారి పట్టించేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని అన్నారు. కూటమి అభివృద్ధి అజెండాతోనే ముందుకు వెళుతుంది అని.. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అని కోరారు.

Read also : హీరోయిన్ అనే రీజన్ తోనే నన్ను వదిలేశాడు : మృణాల్ ఠాకూర్

Read also : కాంగ్రెస్‌కు భారీ షాక్: ‘జాగృతి’ బాట పట్టిన బింగి శివాని శివకిరణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button