తెలంగాణరాజకీయం

చేసిన తప్పును కప్పిపెడుతూ.. కులాల మధ్య చిచ్చు..

మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటమికి కుట్రలు పన్నిన వారే.. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు నీచమైన రాజకీయాలకు తెరతీశారని నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి-మేటి చందాపురం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఏరుకొండ అబ్బయ్య మండిపడ్డారు.

ఇందుర్తి-మేటి చందాపురం గౌడ కులస్తులు బిఆర్ఎస్ పార్టీతోనే

స్వార్ధ రాజకీయాలతో గ్రామంలో గందరగోళం..

: ఏరుకొండ అబ్బయ్య

మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటమికి కుట్రలు పన్నిన వారే.. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు నీచమైన రాజకీయాలకు తెరతీశారని నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఇందుర్తి-మేటి చందాపురం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఏరుకొండ అబ్బయ్య మండిపడ్డారు. శనివారం ఆయన తన మద్దతుదారులతో కలిసి మర్రిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చెరుకు లింగం గౌడ్, ఐతగోని అశోక్ గౌడ్‌లు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

తాను గౌడ కులస్తులను అవమానించానని, తీవ్ర పదజాలంతో దూషించానని లింగం గౌడ్, అశోక్ గౌడ్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అబ్బయ్య స్పష్టం చేశారు. గతంలో దాదాపు ఒక సంవత్సరం క్రితం ఏదో సందర్భంలో వ్యక్తిగతంగా మాట్లాడిన పాత ఆడియోను తీసుకుని, దాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అన్వయిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. ఇది ముమ్మాటికీ తన వ్యక్తిత్వ హననం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గౌడ కులస్తులతో తనకు అన్నదమ్ముల వంటి అనుబంధం ఉందని, కుల పెద్దలంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే పార్టీ అభ్యర్థి అయిన తనకు వెన్నుపోటు పొడిచారని అబ్బయ్య ఆరోపించారు. వారి ద్రోహం వల్లే తాను కేవలం 6 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని గుర్తు చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను బీఆర్ఎస్ అధిష్ఠానం లింగం గౌడ్, అశోక్ గౌడ్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేసిందని.. అది జీర్ణించుకోలేకనే ఇప్పుడు తనపై నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు.

ఒకవేళ తెలియక ఏదైనా సందర్భంలో పొరపాటుగా మాట్లాడి ఉంటే గౌడ కుల బాంధవులను క్షమించమని కోరుతున్నానని చెప్పారు. పాత ఆడియోలను రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇటువంటి చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతారని అబ్బయ్య అన్నారు. ఇట్టి కార్యక్రమంలో అనంతల నరసింహ గౌడ్, అయితగోని యాదయ్యగౌడ్, అయిత గోని నరసింహ గౌడ్, అనంతల వెంకటేష్ గౌడ్, అయితగోని యాదగిరి గౌడ్, అయితగొని రాఘవేంద్ర గౌడ్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ALSO READ: నాలుక రంగు మారితే అనారోగ్యమా? డాక్టర్లు చెప్పే రహస్యం ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button