తెలంగాణ

పాలు పగిలిపోయాయని కంప్లైంట్.. కూకట్ పల్లిలో హెరిటేజ్ పై కేసు!

హైదరాబాద్ కూకట్ పల్లిలో విచిత్ర ఘటన జరిగింది. సూపర్ మార్కెట్ లో ఉన్న పాలు పగిలిపోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చాడు. సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వినడానికే వింతగానే ఉన్న ఈ కేసులో బలమైల లాజిక్ ఉందంటున్నారు పోలీసులు. అరుదుగా వచ్చే కేసులలో ఇదొకటిగా నిలిచిందని చెబుతున్న పోలీసులు.. ప్యాకెట్ పాలు ఎలా పగిసాయి.. దానికి బాధ్యులు ఎవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో రెండు ప్యాకెట్ల హెరిటేజ్ పాలను కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. ఇంటికి తెచ్చి కాచారు. మొదటి ప్యాకెట్ బాగానే ఉంది. రెండో ప్యాకెట్ కాచేసరికి పాలు పగిలిపోయాయి. ఆ పాలను రెండు గిన్నెలో వేసి పెరుగు చేయాలని చూసినా కంపు వాసన వచ్చాయి. దీంతో ఆ పాలను అలాగే ఉంచిన సదురు వ్యక్తి.. తాను పాలు కొన్న సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. ప్యాకెట్ లోని పాలు పాడైపోయాయని.. కంపు కొడుతున్నాయని చెప్పారు. అలాంటి పాలు ఎందుకు విక్రయించారని నిలదీశాడు. అయితే సూపర్ మార్కెట్ ఉద్యోగులు మాత్రం తమకేం తెలియదని.. ప్యాకెట్ లో పాలు బాగా లేకుంటే తామేం చేస్తామని… ఆ పాలను తాము తయారు చేయలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

సూపర్ మార్కెట్ ఉద్యోగుల సమాధానంతో మరింత చిర్రెత్తుకొచ్చిన బాధితుడు.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. కాను కొన్న పాలు పగిలిపోయాయని.. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు రాసి ఇచ్చాడు. పాడై పోయన పాలను గుర్తించకుండా తాగితే తామంటూ హాస్పిటల్ లో చేరాల్సి వచ్చేందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సూపర్ మార్కెట్ తో పాటు పాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరాడు. బాధితుడి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీటిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ఎంతోమంది కన్జ్యూమర్లు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button