- అప్యాయంగా పలకిస్తూ ఇంటింటా ప్రచారం
- సంక్షేమ పథకాలు, అభివృద్దిపై వివరణ
హుస్నాబాద్, క్రైం మిర్రర్ః
హుస్నాబాద్ మున్సిపాలిటిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందు కుంది.మున్సిపాలిటి 5వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొలిశెట్టి రాజుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
భారీ ర్యాలితో కార్యకర్తలతో కలిసి గడపగడపకు తిరుగుతు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు.
మహిళలను, వృద్దులను అప్యాయ పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళికతో అభివృద్దిలో ముందు నిలుపుతానన్నారు.
20 స్థానాలు గెలిస్తే అభివృద్దిలో అగ్రగామిగా నిలుపుతానన్నారు ఈ కార్యక్రంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





