Tuesday, March 10, 2026
Homeతెలంగాణవిష్ణు ఉన్నత పాఠశాలలో వైభవంగా బోనాల పండగ

విష్ణు ఉన్నత పాఠశాలలో వైభవంగా బోనాల పండగ

హత్నూర, క్రైమ్ మిర్రర్ :-
నర్సాపూర్ పట్టణ కేంద్రంలో విష్ణు ఉన్నత పాఠశాలలో శనివారం నాడు వైభవంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ముందుగా గజమాల పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం బోనాల విశిష్టతపై పాఠశాల ఉపప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్ మరియు ఇతర ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఆ తరువాత 6 నుండి 10వ తరగతి విద్యార్థులు వివిధ జానపద గీతాలపై నృత్యప్రదర్శనలు చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో విద్యార్థులు బోనాల పండుగ ఆవశ్యకతను తెలియజేశారు. కొంత మంది విద్యార్థులు భక్తి గీతాలను ఆలపించారు, గ్రామ దేవతల ఆకృతులతో విద్యార్థులు బోనాలను అందంగా ముస్తాలు చేసారు. మరికొంత మంది విద్యార్థులు పోతరాజుల విన్యాసాలతో అందరిని ఆకట్టుకున్నారు. ఇంకొందరు విద్యార్థులు అమ్మవారి ఆకృతులను చిత్ర లేఖన కళను ప్రదర్శించి తమ భక్తిని చాటుకున్నారు. చివరగా అమ్మ వారికి నివేదనగా సమర్పించిన ప్రసాదాన్ని విద్యార్థులందరికి వితరణ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యం హర్షాన్ని వ్యక్తం చేశారు.

కొడకా బీ కేర్‌ ఫుల్‌… బండి సంజయ్‌పై ఈటల ఫైర్‌

సీఎం రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments