క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రంలో ఫిబ్రవరి 26 వ తేదీన మహబూబాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న వాహన దారుడి పై, వారి అమ్మ పై దాడిచేసిన కానిస్టేబుళ్లను తక్షణమే సస్పెండ్ చేయాలని, చట్టపరంగా శిక్షించాలని బాదితుల తో కలసి ఎమ్మార్పియస్, బీసీ సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్హేఛ్ఓకి ఫిర్యాదును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాదితులు ధర్మారపు శ్రీశైలం,ధర్మారపు రామక్క MRPS రాష్ట్ర నాయకులు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,ఆత్మకూరు(ఎం) ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్, పట్టణ కాంగ్రేస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, నేతాజీ యువజన మండలి అధ్యక్షులు దొంతరబోయిన మురళీ కృష్ణ,కాంగ్రేస్ నాయకులు దొంతరాబోయిన భాస్కర్,ఎమ్మార్పియస్ మండల నాయకులు మందుల లింగ స్వామి మాదిగ,వార్డు సభ్యులు గట్టు విశాల్, యువజన సంఘాల నాయకులు నాతి మల్లిఖార్జున్, కిరణ్ గౌడ్, బాబు తదితరులు పాల్గొన్నారు.
గూడెం ప్రజలకు పల్లె వెలుగు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్సీ
ప్రకృతి ఒడిలో హోళీ.. రసాయన రంగులకు స్వస్తి పలుకుదాం
