తెలంగాణ

పగిలిన త్రాగు నీటి పైప్..వాటర్ వాషింగ్ గా మారిన లీకేజ్!.

క్రైమ్ మిర్రర్, నల్గొండ :- త్రాగునీటి పైప్ పగిలి గంటల కొద్ది నీరు వృధాగా పోతున్నా, అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇక వివరాల లోకి వెళ్తే కనగల్ నుండి చండూర్ వెళ్లే మార్గంలో, రోడ్డుకు పక్కనే త్రాగు నీటి పైప్ పగలడంతో, దాదాపు రెండు గంటల నుండి పెద్ద ఎత్తున నీరు, ఎగిసి పడుతూ, రోడ్డు వెంట త్రాగు జలం వృధాగా పోతుంది. గంటల కొద్ది నీరు వృధాగా పోతున్నా, అధికారులు మాత్రం తమకేమి పట్టదన్నట్లుగా, గాలికి వదిలేసిన తీరును చూపరులు విమర్శిస్తున్నారు.

వేలకు వేలు జీతాలు తీసుకుంటూ, ఇలాంటి నష్టం వాటిల్లే సమయంలో అధికారులు ఏమి చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సుమారు 15 ఫీట్ల ఎత్తుకు ఎగిసి పడుతున్న, ఆ నీటి కింద వాహనాలు ఆపి, ఉచితంగా సర్వీసింగ్ చేసుకుంటున్నారు కొందరు. ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యాన్ని రుజువు చేస్తుందంటూ, అధికారుల ప్రవర్తనపై మండిపడుతున్నారు ప్రజలు. లీక్ అవుతున్న నీటి ప్రవాహం కింద, ఎటిఎం మిషన్లలో డబ్బులు వేసే వాహనం ఎంచక్కా స్నానం చెయ్యటం అధికారుల ఉద్యోగ బాధ్యత తెలుస్తుందని అనుకుంటున్నారు..వెంటనే ఉన్నత అధికారులు స్పందించి నీటిని అదుపు చేసే ప్రయత్నం చెయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక సమస్య, చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

  2. ట్రాఫిక్ క్లియర్ చేసిన చండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button