
క్రైమ్ మిర్రర్, తెలంగాణా :- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులకు రేషన్ కార్డులను అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులను జారీ చేసింది. ఇక ఈ రేషన్ కార్డుల ద్వారానే రాష్ట్రంలో అందించే పథకాలన్నీ కూడా అమలవుతూ వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా వేలాదిమంది ప్రజలు ఈ రేషన్ కార్డులను ఉపయోగించడం లేదని ప్రభుత్వం దృష్టికి రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే రేషన్ కార్డులు ఉండి కూడా వరుసగా ఆరు నెలల పాటు రేషన్ తీసుకోని వారు ఉంటారు వారి రేషన్ కార్డులను రద్దు చేసేందుకు పౌరసరఫరాల శాఖ రాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అలాగే ప్రతి ఒక్క మండలం మరియు గ్రామాల నుంచి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు.
ఇప్పటివరకు గడిచిన ఆరు నెలల్లో ఒక్కసారి కూడా రేషన్ తీసుకొని వారి సంఖ్య 78,842 రేషన్ కార్డులు ఉన్నట్లుగా తేలింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులు అన్నిటిని కూడా వెంటనే రద్దు చేయాలని నిర్వహించింది. అన్ని జిల్లాల కలెక్టర్లను పంపించి… క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఈ 78,842 రేషన్ కార్డుల్లో ఉన్న అనర్హులను వెంటనే గుర్తించి త్వరలోనే వారి రేషన్ కార్డులను రద్దు చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హులుగా ఉన్న 78,842 రేషన్ కార్డుల్లో అత్యధికంగా నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాలోనే అత్యధికంగా అనర్హులుగా ఉన్నట్లు తెలిసింది.