క్రైమ్

కారు ప్రమాదంలో గాయపడ్డ వైయస్ఆర్‌సీపీ నేత కొండా రాజీవ్

తిరుపతి, క్రైమ్ మిర్రర్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అరుణాచలం నుంచి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర గాయాలతో హాస్పిటల్‌కు తరలించబడ్డారు.

ఈ విషాదకర ఘటనపై వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఫోన్ ద్వారా రాజీవ్ గాంధీని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తగిన మెరుగైన చికిత్స కోసం పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.

ప్రమాద వివరాలు తెలిసిన వెంటనే పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన ఆరోగ్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజీవ్ గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button