Saturday, March 14, 2026
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో 18 మంది మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో 18 మంది మృతి!

Road accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బస్సు ఢీకొనడంతో 18 మంది మృతి చెందింది. శ్రావణమాసం సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల భక్తులు కన్వర్ యాత్రకు బయలుదేరారు. భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో ఈ ఘోరం జరిగింది.

దేవ్ గఢ్ లో కన్వర్ భక్తుల బస్సుకు ప్రమాదం

జార్ఖండ్‌ లో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్‌ ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రావణ మాసం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు కన్వర్ యాత్రకు వెళ్తున్నారు. అలాగే వస్తున్న భక్తుల బస్సు జార్ఖండ్‌లోని దేవ్‌ గఢ్ కు చేరుకోగానే ట్రక్‌ ‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.  అతివేగం కారణంగా డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక, ట్రక్ ను తగిలించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Read Also: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు, యెమెన్ సర్కారు కీలక నిర్ణయం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments