తెలంగాణ

యూఏఈలో తెలుగోడికి రూ.240 కోట్ల లాటరీ

యూఏఈలో తెలుగు యువకుడికి అదృష్టం పండింది. ఏకంగా 240 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకున్న యువకుడు.. 230 కోట్లు రూపాయలు గెలుచుకున్నాడు. యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు ఏపీకి చెందిన బోళ్ల అనిల్ కుమార్ అనే యువకుడు

లాటరీ టికెట్ల కొనుగోలు చేయడం అనిల్ కుమార్ కు అలవాటు. అందులో భాగంగానే ఒక లాటరీ కొన్నాడు. అయితే ఈ నెల 18వ తేదీన జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 240 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు బోళ్ల అనిల్ కుమార్. ఇందులో తన ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగే లాటరీ టికెట్ కొన్నానని, అందులో చివరి నంబర్లు మా అమ్మ పుట్టిన తేదీ కావడంతోనే తనకు అదృష్టం కలిసి వచ్చిందని చెబుతున్నాడు యువకుడు.

ఈ డబ్బుతో తన తల్లిదండ్రులను అబుదాబి తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడతానని, ఒక లగ్జరీ కారు కొంటానని, కొంత డబ్బును చారిటీలకు ఇస్తానని యువకుడు ప్రకటించాడు. ఇదే లాటరీ ఇండియాలో గెలిస్తే దాదాపు రూ.90 కోట్లు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, యూఏఈలో లాటరీపై ఎలాంటి పన్ను లేదని అనిల్ కుమార్ వెల్లడించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button