క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్:- మతాలకతీతంగా అందరూ కలిసి మెలిసి ఉంటూ, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని మహాదేవపూర్ గ్రామ సర్పంచ్ హసీనా అక్బర్ ఖాన్ అన్నారు. మహాదేవపూర్ మండలంలో జరిగే మహాశివరాత్రి మరియు లక్ష్మీదేవరా బోనాలు లాంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఆంక్షలు, పక్షపాతాలు లేకుండా సేవ చేయడమే ద్యేయం అంటూ ముందుకు వెళుతున్నారు. సోమవారం మహాదేవపూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ముదిరాజ్ కులస్తుల లక్ష్మీ దేవర బోనాల కార్యక్రమంలో పాల్గొన్న హసీనా అక్బర్ ఖాన్ మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుందని అన్నారు. ఈ భావన సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుందని పలుగురు మేధావులు అంటున్నారు.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు బందోబస్త్
