క్రైమ్

తెలంగాణ పోలీసులపై హైకోర్టు సీరియస్.. ఇకనైనా మారాలని వార్నింగ్

న్యాయస్థానం చేసే పని కూడా పోలీసులే చేస్తారా అంటూ తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసులు శాంతి భద్రతల కంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని మండిపడింది. సివిల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసుల పట్ల హైకోర్టు సీరియస్ గా స్పందించింది.

హైదరాబాద్ – బార్కస్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి స్థలంపై హైకోర్టులో పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని బాధితుడిని బెదిరించారు పోలీసులు. దీంతో పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన హైకోర్టు పోలీసులపై తీవ్రంగా మండిపడింది. శాంతి భద్రతలకంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆరోపించింది. హైకోర్టులో ఉన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోమని చెప్పడానికి మీరెవరు ? అంటూ పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ధర్మాసనం.

ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా ? ఎండలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి పోలీస్ స్టేషన్లో కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వరు, స్టేషనరీ కూడా ఫిర్యాదుదారుడే తెచ్చుకోవాలని చెప్తున్నారని పోలీసులపై హైకోర్టు సీరియల్ అయింది. ఇకనైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని, బాధితుడిని బెదిరించిన పోలీసులపై విచారణ జరపాలని ఆదేశించింది. న్యాయస్థానాలు చేసే పని చేయడానికి ప్రయత్నించడం ఆపేయాలని, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హెచ్చరించింది హైకోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button