క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- తాజాగా జరిగిన 2026 t20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా కీలకపాత్ర పోషించి భారతదేశానికి ట్రోఫీని అందించి పెట్టినటువంటి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నా చిన్నప్పటి నుంచి చదువు విషయంలో 50% లేదా 60% మాత్రమే వస్తుండేది అని.. కానీ నేడు క్రికెట్లో 80% కు పైగా విన్నింగ్ పర్సంటేజ్ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. చదువులో సాధించలేకపోయినది.. క్రీడల్లో సాధించగలిగాను అని ఆనందాయకంగా పేర్కొన్నారు. నా ఫ్యామిలీ చిన్నప్పటినుంచి చదువుపై ఫోకస్ చేయాలి అని చెప్పినప్పటికీ.. క్రికెట్ లో నేను రాణిస్తున్న ప్రతిభను గుర్తించి ఆ తర్వాత ఫ్యామిలీ పూర్తిగా నాకు సపోర్ట్ చేశారు అని వెల్లడించారు. టి20 వరల్డ్ కప్ నెగ్గినప్పటికీ కూడా నా భార్య నాలో అహంకారం పెరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటుంది అని ఎద్దేవా చేశారు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ నెగ్గడం అతనితో పాటు భారతీయులకు కూడా గర్వకారణ.
గుజరాత్ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. పరుగులు తీసిన నాయకులు!
కీలక పదవి కోసం యనమల వెయిటింగ్!
