Tuesday, February 24, 2026
Homeతెలంగాణతెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ (శనివారం) అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్‌, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అటు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, కరీంనగర్‌, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదు

ఈ నెల 1 నుంచి 15 వరకు తెలంగాణ వ్యాప్తంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 15 రోజుల సాధారణ వర్షపాతం 106 మిల్లీమీటర్లే.. అంటే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఆగస్టు 15 వరకు సాధారణ వర్షపాతం 464 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 509 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

 ఏపీలో 19 వరకు వర్షాలు

అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో ఈ నెల 19 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.  పశ్చిమ మధ్య, దానిని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముంది.  అటు తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఈ నెల 19వ తేది వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 50 కి.మీ ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.

Read Also: భారీ వర్షాలకు రాజధాని మునిగిందంటూ ప్రచారం.. స్పందించిన ప్రభుత్వం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments