Friday, March 20, 2026
Homeతెలంగాణబనకచర్లను వ్యతిరేకిస్తున్నాం - స్పష్టంచేసిన మంత్రి శ్రీధర్‌బాబు

బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం – స్పష్టంచేసిన మంత్రి శ్రీధర్‌బాబు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో అసమర్థతలున్న పరిస్థితుల్లో, కృష్ణా, గోదావరి నదుల నీటి వాటాలు పూర్తిగా తేలిపోయిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడాలని ఆయన అన్నారు.

“ప్రత్యేకించి బనకచర్ల ప్రాజెక్టు లాంటి వాటికి కఠినంగా వ్యతిరేకంగా ఉంటుంది. మేము జలాల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం,” అని మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుండి వస్తున్న ప్రకటనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోదని అన్నారు. “వారు రాజకీయ లబ్ధికోసం అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిపై మనం స్పందించాల్సిన అవసరం లేదు” అని తేల్చిచెప్పారు.

Read also : వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి!..ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు నిశ్చయమైన కమిషన్ నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తప్పవని అన్నారు. “ప్రస్తుతం మేము అన్ని ప్రాజెక్టులపై సమగ్ర పరిశీలనలో ఉన్నాం. అవసరమైన చోట చర్యలు తీసుకుంటాం. నదీజలాలపై తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్రంతో కూడా మాటామంతీలు జరుగుతున్నాయి” అని వెల్లడించారు.

Read also : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ – అఖల్ దేవ్‌సర్‌లో ఓ ఉగ్రవాది హతం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments