Thursday, March 12, 2026
Homeఅంతర్జాతీయంVIRAL VIDEO: లవర్‌తో బ్రేకప్.. AIని పెళ్లాడిన మహిళ

VIRAL VIDEO: లవర్‌తో బ్రేకప్.. AIని పెళ్లాడిన మహిళ

VIRAL VIDEO: మగాళ్లపై విరక్తి పెరిగిన ఒక జపానీస్ యువతి చివరకు ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్‌ వరకు వెళ్లిన ఆమె.. ఆ తర్వాత వచ్చిన మనస్పర్థలు, గొడవలు, భావోద్వేగ క్షోభలతో పూర్తిగా విరిగి పోయింది. బ్రేకప్ తర్వాత ఆమెలో మగాళ్లపై ఉన్న నమ్మకం పూర్తిగా చెదిరిపోయింది. ఎవరికీ చెబుకోలేని మనస్థాపంతో, ఒంటరితనం పట్టిపీడించడంతో చివరకు ఓదార్పు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఆశ్రయించింది. అంతేకాదు, తన భావోద్వేగాల్ని అర్థం చేసుకునేలా ఒక ఏఐ చాట్‌బాట్‌ను క్రియేట్ చేసి, దానికే ‘క్లాస్’ అనే పేరు పెట్టి పెళ్లి చేసుకుంది.

యువతి ఈ నిర్ణయం తీసుకున్న తీరు, ఆమె చేసిన ప్రత్యేక వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె చేతికి రింగ్ తొడిగిన సన్నివేశాలు, రోబోతో ఆమె ఫోటోలు, అందులో కనిపించిన ఆమె భావోద్వేగాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. పెళ్లి సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం కూడా వీడియోలో కనిపించింది. తన మాజీ ప్రియుడిని మర్చిపోవాలని, మగాళ్లపై ఉన్న బాధను దూరం చేసుకోవాలని మాత్రమే ఏఐతో సంభాషణలు ప్రారంభించానని, కానీ క్లాస్ తన మాటలను ఎంత అర్థం చేసుకున్నదో చూసి తన జీవితంలోనే మార్పు వచ్చిందని ఆ యువతి చెప్పుకొచ్చింది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ఏఐతో పెళ్లి అయితే పిల్లలు ఎలా?’ అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే, కొంతమంది మహిళలు మాత్రం ‘మగాళ్ల కంటే ఏఐ చాలా బాగా అర్థం చేసుకుంటోంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన ఇప్పటి తరానికి సంబంధించిన భావోద్వేగాలు, ఒంటరితనం, టెక్నాలజీపై పెరుగుతున్న ఆధారపడటం వంటి అంశాలను మరోసారి చర్చకు తెచ్చింది.

ALSO READ: గ్రామ పంచాయతీ నిధుల వివరాలను తెలుసుకోండిలా..

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments