అంతర్జాతీయం

ఇరాన్-ఇజ్రాయెల్ వార్, ట్రంప్ సంచలన ప్రకటన!

US Strikes Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్రూత్ వేదికగా వెల్లడించారు. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ అణు వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. ఇరాన్ ప్రతీకార బెదిరింపుల నేపథ్యంలో దాడులు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా నేరుగా యుద్ధంలోకి అడుగు పెట్టడంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది.

భూగర్భంలో ఉన్న అణు స్థావరాలపైనా దాడులు

గడిచిన 10 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడులకు దిగుతుంది. ఈ దాడులు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ, క్షిపణులు సామర్థ్యాలను టార్గెట్ చేసింది. అటు ఇరాన్ అణు ఇంధన సౌకర్యాలకు తీవ్ర నష్టం కలిగేలా చేసింది. తాజాగా ఇరాన్ లో భూగర్భంలో ఉన్న అణు క్షేత్రాలను బీ2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. తమ దాడులలో ఫోర్డో, నటాంజ్, ఎస్ఫాహాన్‌ లో ఉన్న మూడు అణు క్షేత్రాలను కొలాప్స్ చేసినట్లు తెలిపింది. ఈ మూడు అణు క్షేత్రాలు ఇరాన్ లో అత్యంత కీలకమైనవిగా తెలిపింది.

అమెరికా ఎందుకు ఎంట్రీ ఇచ్చిందంటే?

ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థకు తీవ్ర స్థాయిలో నష్టం కలిగించేందుకు అమెరికా ఈ దాడులకు దిగింది. ఇరాన్ తో అమెరికాకు చాలా కాలంగా శత్రుత్వం ఉంది. ఇజ్రాయెల్ దాడులను బేస్ చేసుకుని అమెరికా ఇందులోకి అడుగు పెట్టింది. నిజానికి ఇరాన్ అణు వ్యవస్థ అభివృద్ధి పట్ల చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ అణు వ్యవస్థతో మిడిల్ ఈస్ట్ కు ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కు అమెరికా జతకలవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Read also: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు, క్లస్టర్ బాంబులతో అటాక్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button