Wednesday, March 11, 2026
Homeఅంతర్జాతీయంరష్యా, ఉక్రెయిన్‌ భీకర దాడులు, ముగ్గురు మృతి!

రష్యా, ఉక్రెయిన్‌ భీకర దాడులు, ముగ్గురు మృతి!

Russia-UkraineAttacks: రష్యా, ఉక్రెయిన్ మధ్య వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్‌ కీవ్‌ లో మంత్రులు నివసించే క్యాబినెట్‌ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది. ఫస్ట్ రష్యా వాయుసేన సెంట్రల్‌ కీవ్‌లో మంత్రులు నివసించే భవనం లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడాది చిన్నారి సహా ముగ్గురు మరణించారు.

ప్రతీకార దాడులకు దిగిన ఉక్రెయిన్

రష్యా దాడులను తీవ్రంగా పరిగణించిన ఉక్రెయిన్ ప్రతీకార దాడులకు దిగింది. రష్యా బ్రయాన్స్‌ లోని డ్రుజ్బా ఆయిల్  పైపులైన్‌ పై దాడి చేసింది. రెండు దేశాలు కూడా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు జరుపుకున్నాయి.ఈ దాడిలో ఇతర ఉక్రెయిన్‌ నగరాలను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుంది. క్రెమెన్‌ చుక్‌ లో డజన్ల కొద్దీ విద్యుత్‌ సౌకర్యాలు రష్యా దాడితో దెబ్బతిన్నాయి. అలాగే అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరమైన క్రివీరిహ్‌ లో కూడా క్షిపణులు రవాణా, మౌలిక సదుపాయాలపై దాడులు జరిపాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇదొకటిగా విశ్లేషకులు వెల్లడించారు. .

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments