ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ కీలక నిర్ణయం!.. ఇక పై లడ్డు కోసం క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పనిలేదు

క్రైమ్ మిర్రర్, తిరుపతి న్యూస్ :- తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చేటువంటి భక్తుల కోసం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తులు ఎంతగానో ఇష్టపడేటువంటి తిరుమల లడ్డుపై తాజాగా టీటీడీ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై గంటలపాటు క్యూలైన్సులో నించోవలసిన పనిలేకుండా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా తరలివస్తుండడంతో ప్రతి కారణంగా భక్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మళ్లీ చివరిలో లడ్డుల కోసం చాలామంది క్యూలైన్లో వేచి ఉండి అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోవడంతో టీటీడీ ఈ సరికొత్త నిర్ణయం తీసుకువచ్చింది.

ఇకపై లడ్డు కారణంగా ఎక్కువ మంది భక్తులు ఇబ్బందులు పడకుండా, ఎక్కువసేపు పాటు క్యూలైన్లో వేచి ఉండకుండా డిజిటల్ పద్ధతిని తీసుకువచ్చారు.
ఈ కొత్త పద్ధతి ఎలా ఉపయోగపడుతుందో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం!
టీటీడీ తీసుకురాపోయే కొత్త విధానంలో భక్తులు తమ దర్శన టికెట్ నెంబర్ను కియోస్కు లో నమోదు చేయడం ద్వారా కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంచుకొని యుపిఐ లేదా ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా అతి తక్కువ సమయంలోనే టికెట్ పొందవచ్చు. అలాగే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు దర్శన టికెట్ లేకుండానే నేరుగా లడ్డూలు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. దర్శనం టికెట్ లేకుండానే తిరుమలకు వెళ్లేటువంటి భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని టిటిడి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ లో మూడు రోజులు వర్షాలు, ఐఎండీ కీలక అలర్ట్!

ఏ ఒప్పందమూ జరగలేదు.. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button