Wednesday, March 4, 2026
Homeఅంతర్జాతీయంవ్యక్తిగత కోపం భారత్‌ పై ట్రంప్ టారిఫ్ లు, తేల్చిన జెఫెరీస్‌ నివేదిక!

వ్యక్తిగత కోపం భారత్‌ పై ట్రంప్ టారిఫ్ లు, తేల్చిన జెఫెరీస్‌ నివేదిక!

Jefferies Report: వ్యక్తిగత కోపంతోనే భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం సుంకాలు విధించారని అమెరికన్‌ మల్టీనేషనల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ జెఫెరీస్‌ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు తనను అనుమతించలేదన్న కోపంతోనే భారత వస్తువులపై సుంకాలను పెంచారని తేల్చి చెప్పింది.

ఈ ఏడాది మేలో భారత్‌, పాక్‌ మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక దాడుల్లో జోక్యం చేసుకోవాలని ట్రంప్‌ ఆశించారని నివేదిక పేర్కొంది. కానీ, ఈ వివాదంతో భారత్ మూడో దేశం జోక్యాన్ని కోరుకోలేదని తెలిపింది. ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ట్రంప్ అడ్డగోలుగా సుంకాలు విధిస్తున్నారని వెల్లడించింది. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి రావాలని ప్రయత్నిస్తున్నారని, అన్ని దేశాల వివాదాలను తనే పరిష్కరించినట్లు భావిస్తున్నారని జెఫెరీస్‌ నివేదిక తెలిపింది. భారత్ ఈ విషయంలో ట్రంప్ మద్దతు తీసుకోకపోవడంతో ఆయనకు శాంతి బహుమతి ఆశలు గల్లంతయ్యాయని వెల్లడించింది. ఈ కారణంగా భారత్ మీద కోపం పెంచుకున్నారని చెప్పుకొచ్చింది.

అటు భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య బంధం క్షీణించడానికి వ్యవసాయం మరో ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. వ్యవసాయ రంగంలో దిగుమతులకు భారత్‌ ఏనాడూ అనుమతులు ఇవ్వాలేదని చెప్పింది. అంతేకాదు, రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల విషయంలో రాజీపడబోమని మోడీ తేల్చి చెప్పడం ట్రంప్ కు నచ్చలేదన్నారు. ఫలితంగా భారత్ పై ట్రంప్ టారిఫ్ ల పేరుతో ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని జెఫెరీస్‌ నివేదిక తేల్చి చెప్పింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments