Monday, March 2, 2026
Homeఅంతర్జాతీయంరేపటి నుంచే 50 శాతం పన్నులు, కేంద్రం కీలక నిర్ణయం!

రేపటి నుంచే 50 శాతం పన్నులు, కేంద్రం కీలక నిర్ణయం!

India-US Trade Deal: అమెరికా అధ్యక్షుడు భారత్ మీద విధించిన 50 శాతం టారిఫ్ లు రేపటి (ఆగస్టు 27) నుంచి అమలు కాబోతున్నాయి. ప్రస్తుతం 25శాతం టారిఫ్ లు అమలు అవుతుండగా, ఇకపై మరో 25 శాతం పెరగనున్నాయి. ఇది ఎగుమతి దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అమెరికా విధించిన భారీ సుంకాలు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఎగుమతిదారుల కోసం తీసుకుంటున్న చర్యలపై ఇవాళ ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పలు రంగాలపై టారిఫ్ ల ఎఫెక్ట్!

అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి వస్తే వ్యవసాయం, ఫార్మా, జౌళి, చర్మ ఉత్పత్తులపై ప్రభావం పడనున్నాయి. ఎగుమతులపైనే ఆధారపడిన పరిశ్రమలు, చిన్న, మధ్యతరహా సంస్థలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే సమావేశంలో ఎగుమతిదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇవ్వాలనే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఎగుమతిదారులపై భారం పడకుండా అససరమైతే రాయితీలు కల్పించే అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments