తెలంగాణ

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో బైక్‌పై వెళ్తున్న కుటుంబం పై తీగ పడి విషాదం

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా :- మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఈదురు గాలులకు తెగిపోయిన విద్యుత్ తీగ ఓ కుటుంబం మీద పడిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సురేష్, ఆయన భార్య మౌనిక, మూడేళ్ల కుమారుడు శ్రేయాస్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా పై నుంచి విద్యుత్ తీగ మీద పడింది. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది. ప్రస్తుతం సురేష్, శ్రేయాస్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.విద్యుత్ తీగలు ఖచ్చితమైన భద్రత లేకుండా ఉండటం, అలాంటి పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఊసరవెల్లి రాజకీయాలు మానుకోండి :గోల్కొండ కిరణ్

మంత్రివర్యులకు కృతజ్ఞతలు అంటున్న సూరారం గ్రామస్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button