
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మర్రిగూడ మండలంలోని ఇందుర్తి మేటిచందాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గ్రామ బొడ్రాయి (నాభి శిల) తృతీయ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంప్రదాయానికి చిహ్నంగా నిలిచిన ఈ ఉత్సవం గ్రామ ప్రజల, భక్తుల భాగస్వామ్యంతో జాతరలా మారింది.
మంగళ వాయిద్యాల మధ్య ప్రారంభమైన ఉత్సవం గణపతి పూజతో ఆరంభమై పుణ్యావచనము, రక్షాబంధనము, మండపారాధన వంటి శాస్త్రోక్త పూజలతో ముందుకు సాగింది. అనంతరం, గ్రామ దేవత అయిన బొడ్రాయి నాభిశిలకు ఘనంగా అభిషేకాలు నిర్వహించగా, చండీ గణపతి హోమాలు, 21కిలోల అన్నంతో బలి కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పవిత్రమైన మహా పూర్ణాహుతి, కలశ సంప్రోక్షణ వంటివి గ్రామ ప్రాంగణాన్ని పవిత్రతతో నింపాయి. ఈ యాగాలు, పూజా కార్యక్రమాల్లో బ్రహ్మశ్రీ మహంకాళి వెంకటరమణ శర్మ మరియు శక్తి పూజారి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈపూజ వేడుకల్లో గణపతి హోమం పూర్ణామతి, పాల్గొన్న ఐతగోని యాదగిరి గౌడ్, కుంభం సత్యనారాయణరెడ్డి, ఊరిపక్క నాగేష్, రాఘ గౌడ్, పందిరి బుచ్చయ్య, బొల్లోజు వెంకటాచారి తదితరులు గణేష్ చండీ హోమం నిర్వహించి, పూర్ణావతి కార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేశారు.
ఈ ఉత్సవానికి గ్రామానికి చెందిన, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కుంభం శ్రీనివాస్ రెడ్డి తనవంతు సహకారం ఐతగోని యాదగిరి గౌడ్ అన్ని తనై ముందుండి నడిపించడం గ్రామస్థులు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఉత్సవ కమిటీ సభ్యులైన ఐతగోని యాదగిరి, గణేష్ గౌడ్, రఘు గౌడ్, అశోక్ గౌడ్, పందిరి బుచ్చయ్య, నాగబండి నరసింహా గుప్తా, బొల్లోజు వెంకటాచారి తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర వహించారు.
“గ్రామ ప్రజల భాగస్వామ్యంతో జరిగే ఈఉత్సవం భక్తిశ్రద్ధలతో గ్రామీణ సాంస్కృతిక గొప్పతనాన్ని వెలుగులోకి తెస్తోంది” అని నిర్వాహకులు తెలియజేశారు.