
చండూరు, క్రైమ్ మిర్రర్:- బెల్ట్ షాపుల నిర్మూలన తర్వాత చండూరు సర్కిల్ పరిధిలో కొట్లాట కేసుల సంఖ్య ఘణనీయంగా తగ్గిందని చండూరు సిఐ ఆదిరెడ్డి తెలిపారు.సోమవారం చండూరు సర్కిల్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిజానికి చండూరు పోలీస్ స్టేషన్ పరిధి చాలా ప్రశాంతమైన ప్రాంతమని ఆయన వెల్లడించారు. జిల్లాలో జరిగే నేర సంఖ్యలో ఇక్కడ తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ ఇక్కడ లేవని.. ఇక్కడికి హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వస్తుందని వాటి పైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టి కేసులు చేస్తున్నట్టు తెలిపారు.
అనుమానితులను ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లోని కిట్ల ద్వారా పరీక్షించి పాజిటివ్ వచ్చిన వారికి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ప్రజల ధన, మాన,ప్రాణ రక్షణే తమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల పైన అవేర్నెస్ కలిగి ఉండాలని కోరారు. ద్విచక్ర వాహనాన్ని బయటికి తీసినప్పుడు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాటు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఉండాలని ఆయన సూచించారు. తాగి వాహనాలు నడిపిన హెల్మెట్ ధరించకపోయిన చర్యలు తప్ప అన్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సూచనలు చేశారని తెలిపారు. త్వరలో విద్యార్థి దశ నుండే పిల్లల్లో అవగాహన కార్యక్రమాలు పెంచే కార్యక్రమం జరగబోతుంది అన్నారు.
రోడ్లపై ద్విచక్ర వాహనాలపై అనవసరమైన శబ్దాలు చేస్తూ తిరిగే వారి పైన చర్యలు ఉంటాయన్నారు. మైనర్లకు బైకులు ఇస్తే తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ పిలిచి అవగాహనపరిచే కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్ల పైన తిరుగుతూ శాంతిభద్రతలకు విగాథం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఆయన వెంట చండూరు ఎస్సై ఎన్. వెంకన్న, ట్రైనీ ఎస్సై లింగారెడ్డి, సిబ్బంది ఉన్నారు.