Homeజాతీయంఇండియాకు మేమున్నామంటున్నా అపర కుబేరులు!... ఇక పాక్ గతి అంతే?

ఇండియాకు మేమున్నామంటున్నా అపర కుబేరులు!… ఇక పాక్ గతి అంతే?

క్రైమ్ మిర్రర్, న్యూస్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మన దేశ ఆపర కుబేరులు అయినటువంటి గౌతమ్ అదాని మరియు ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా స్పందించారు. మన భారతదేశానికి మా నుండి ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తామని ప్రకటించారు. యుద్ధంలో పాకిస్తాన్ ను ఓడించి తీరాలని ఇండియాకు సలహా ఇచ్చారు. పాకిస్తాన్తో యుద్ధం నడుమ ఇండియాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈ యుద్ధం నేపథ్యంలోనే మన ఐక్యత అలాగే నిజమైన బలం బయటకు వస్తుందని అదాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక మరోవైపు దేశ సాయిధబలగాలకు అండగా ఉంటామంటూ, దేశ ప్రజలకు ఏది కావాలన్నా చేసి చూపిస్తామని ముకేశ్ అంబానీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మన భారతదేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంటుందని ఈ యుద్ధం సందర్భంగా వెల్లడించారు. దీంతో దేశంలోని ప్రతి ఒక్కరు ఈ ధనవంతులైనటువంటి గౌతమ్ ఆదానికి మరియు ముకేశ్ అంబానీ కి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. యుద్ధం నేపథ్యంలో వీళ్లు బయటకు రావడమే చాలా గొప్ప అనుకుంటే… పూర్తిగా ఏ అవసరం వచ్చినా చేస్తామంటూ తెలపడం మరో ఎత్తని ప్రశంసిస్తున్నారు.

ఏసీబీ కి పట్టుబడ్డ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments