
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాదే అయ్యింది. మళ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉంది. అయినా… అప్పుడే సర్వేలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో… సర్వేలు చేయించుకున్నారు. అయితే.. ఈ సర్వే రిపోర్టులు టీడీపీ ఎమ్మెల్యేలకు గట్టి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతుందని… వచ్చే ఎన్నికల్లో వారి గెలుపు కష్టమే అని సర్వేలు చెప్తున్నాయి. దీంతో.. టీడీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.
ఏడాది పాలనపై సర్వే నిర్వహిస్తే… 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు తప్పిస్తే.. మిగిలిన వారి పనితీరు ఆశించిన స్థాయిలో లేదని ప్రజలు చెప్తున్నాట. ఎందుకంటే.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకే వెళ్లడం లేదని సర్వేలో తేలిందట. కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజల మధ్యకు వెళ్తున్నారట. అందుకే ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతుందని సర్వేలు చెప్తున్నాయి. మరోవైపు… ప్రభుత్వంపై పైస్థాయిలో ప్రజల్లో నమ్మకం అలాగే ఉందని సర్వేల్లో తేలింది.
Also Read : కేసీఆర్ను కవిత ఎందుకు కలిసినట్టు..? – గులాబీ బాస్ ప్లానేంటి..?
సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు.. ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెడుతున్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా… ఐవీఆర్ఎఫ్ సర్వే జరిపిస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేలో.. చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తేలుతోంది. సర్వే రిపోర్టులు చూసిన చంద్రబాబు.. ఎమ్మెల్యేలకు పదే పదే హెచ్చరికలు చేస్తున్నారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు. మరి చంద్రబాబు మాట ఎంతమంది ఎమ్మెల్యేలు వింటారు..? ఎంత మంది తమ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు..? అనేదే ఇక్కడ ప్రశ్న.
ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో వైసీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏముంది..? అని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారట. కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకుని ఏం లాభం అని కూడా ప్రశ్నించుకుంటున్నారట. ఏడాదికే ఇలా ఉంటే… వచ్చే నాలుగేళ్లలో ఎమ్మెల్యే గ్రాఫ్ ఇంకెలా ఉంటుంది. ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత.. ప్రభుత్వానికి దెబ్బే కదా… అన్న ప్రచారం జరుగుతోంది.