Friday, February 27, 2026
Homeతెలంగాణతడిసిన ప్రతి వరి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : ఎమ్మెల్యే కుంభం

తడిసిన ప్రతి వరి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : ఎమ్మెల్యే కుంభం

క్రైమ్ మిర్రర్, వలిగొండ :- యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ మండల పరిధిలోని నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో, వలిగొండ మార్కెట్ యార్డులో వరి ధాన్యపు గింజలు తడిసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. తడిసిన ధాన్యాన్ని అధికారులతో పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని,గతంలో ఎన్నడు లేని విదంగా 12 సెం.మీ వర్షం కురిసిందని అన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు వడ్లను ఎతైన ప్రదేశంలో పోసుకోవాలన్నారు.రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించి ధాన్యం తడవకుండా చూడాలని అధికారులకు సూచించారు.

Read also : బొడ్రాయి ఉత్సవానికి వడ్డేపల్లి దంపతుల రూ.16లక్షల విరాళం

Read also : విజయవాడ హైవేపై రోడ్డుప్రమాదం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments