జాతీయం

పగబట్టిన పంచభూతాలు – వరుస ప్రమాదాలు దేనికి సంకేతం..!

క్రైమ్ మిర్రర్, న్యూస్:- పంచభూతాలు పగబట్టాయా…? గాలి, నీరు, నేల, నిప్పు అన్నీ.. ప్రమాదకరంగా మారాయా..? ఎటు వెళ్లినా.. ఎలా వెళ్లినా ప్రమాదం ముంచుకొస్తోందా..? సెలవులు కదా అని టూర్‌కు వెళ్తే.. టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. విమానం ఎక్కితే… ఎగరలేక కూలిపోయింది. దేవుడి దర్శనం కోసం వెళ్లే.. నీటిలోనే ప్రాణాలు పోయాయి. వరుస ప్రమాదాలతో వందలాది మంది ప్రాణాలు కోల్పాయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో…? ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. అన్న భయం ప్రజల్లో కనిపిస్తోంది.

పెహల్గామ్‌ దాడితో మొదలైన మారణహోమం.. ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. ఈ మధ్య ప్రమాదాలు మరీ ఎక్కువయ్యాయి. కల్లో కూడా ఊహించని విధంగా.. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ ఘోరాలు.. అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. ఎన్నో కుటుంబాలకు కడుపుకోతకు మిగిల్చాయి. ఇలా ఎందుకు జరుగుతోంది…? ఓవైపు దేశాల మధ్య యుద్ధాలతో రక్తపాతం కొనసాగుతూనే ఉంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య వార్‌.. కొనసాగుతూనే ఉంది. భారత్‌-పాక్‌ మధ్య కూడా ఉద్రిక్తతలు టెన్షన్‌ పెట్టాయి. ఇప్పుడు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే… వరుస ప్రమాదాలు ప్రజలను భయపెడతున్నాయి.

ప్రకృతి అందాలను ఆశ్వాదించేందుకు పెహల్గామ్‌ వెళ్తే.. ఉగ్రవాదులు అటాక్‌ చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీశారు. క్రికెట్‌ టీమ్‌ గెలిచిందని సంబరాలు జరుపుకుంటుంటే… తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. విమానం ఎక్కితే.. ఎగరలేక.. కూలిపోయి.. పేలిపోయింది. ఎటు చూసినా మాంసపు ముద్దలు.. మృతదేహాలను కూడా గుర్తించలేనంత ఘోరం జరిగిపోయింది. వందల మంది మంటల్లో కాలిపోయారు. అహ్మదాబాద్‌ ఫ్లైట్‌ క్రాష్‌ మరువకముందే.. ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్‌ కూలి మరో ఐదుగురు మరణించారు. బాసరలో దేవుడి దర్శనానికి వెళ్లిన.. పుణ్యస్నానాల కోసం గోదావరిలో దిగితే… ఐదుగురు మునుగిపోయారు. పూణెలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలి.. మరో ఆరుగురు నదిలో కొట్టుకుపోయారు. ఇలా… వరుస దుర్ఘటనకు అందరినీ కలిసివేస్తున్నాయి. పొద్దుల లేస్తే… ఏ ఘోరం వినాల్సి వస్తుందో అన్న ఆందోళన కలుగుతోంది.

పెహల్గామ్‌ టెర్రర్ అటాక్‌, బెంగళూరు తొక్కిసలాట, అహ్మదాబాద్‌ ఫ్లైట్‌ క్రాష్‌… ప్రమాదం ఏదైనా.. ప్రాణాలు మాత్రం చికెటెలో గాల్లో కలిసిపోతున్నాయి. ఇవన్నీ మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయా..? లేక పంచభూతాలు మనుషులపై పగబట్టాయా..? అన్న అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ఇదంతా భగవంతుడి లీల అని కొందరు అంటుంటే… మానవ తప్పిదాలే మరణ శాసనాలు అవుతున్నాయని మరికొందరు వాదిస్తున్నారు.

శోభనం కోసం ఒత్తిడి.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య!

రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button