క్రైమ్ మిర్రర్ ప్రత్యేకం
క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప) : హిందువులకు పవిత్రమైన శివాలయాలను కొందరు అపవిత్రం చేస్తున్నారు.. ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసం సేవించడం నిషేధమైనా అవేమీ తమకు వర్తింపవన్నట్లు ప్రవర్తిస్తున్నారు కొందరూ.. ఇక ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతో దేవాలయ ప్రాంగణంలో తమ విద్యార్థులకు ఏకంగా మాంసంతో భోజనం వడ్డించేశారు ఓ క్రిస్టియన్ పాఠశాల యాజమాన్యం….. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సోమవారం ఓ క్రిస్టియన్ స్కూల్ కు చెందిన విద్యార్థులు సందర్శించారు. హన్మకొండ లోని భీమరంకు చెందిన ఓ క్రిస్టియన్ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థులను విహారయాత్ర పేరిట రామప్పకు తీసుకువచ్చి ఆలయ శిల్పాలను చూపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మాంసాహారం వండి విద్యార్థులకు బహిరంగంగా వడ్డించి భోజనం పెట్టారు.
Also Read : కుమారీ అంటీ స్టోరీపై ‘నెట్ఫ్లిక్స్’లో డాక్యుమెంటరీ.. అమ్మ బాబోయ్..!?
ఆలయ ప్రాంగణంలో భోజనం చేస్తున్న విద్యార్థుల్లో ఒకరు ఇక్కడ భోజనం చేయనంటూ చెప్తుంటే ఆ విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొడుతున్న క్రమంలో ఇది చూసిన ఓ భక్తుడు ఎందుకు కొడుతున్నారో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లగా.. విద్యార్థుల ప్లేట్లల్లో మాంసం ఉండడం చూసిన ఓ భక్తుడు ఆలయ ప్రాంగణంలో మాంసాహారం తినడంపై మండిపడ్డారు. దింతో సదరు భక్తుడు వారిని వీడియో తీస్తూ నిలదీశారు. ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ ఎందుకు పెట్టారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమకేమీ తెలియదంటూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వగా.. దింతో ఆగ్రహించిన సదరు భక్తుడు విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారని, భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటున్నారా అని వారిని ప్రశ్నించారు. దింతో పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం అక్కడి నుంచి ఆలయ అవతలికి వెళ్లి భోజనం చేశారు.. ఓ భక్తుడు తీసిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు సాధించిన రామప్ప దేవాలయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న పట్టించుకునే వారు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : బీఆర్ఎస్కు షాక్… కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత
రామప్పలో అధికారుల మధ్య సమన్వయ లోపం..
రామప్ప దేవాలయంలో పనిచేసే అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండడంతో ఒకరిపై ఒకరికి విద్వేషం ఉన్నట్లు గతంలో జరిగిన చాలా సంఘటనలు స్పష్టం చేశాయి. పురావస్తు శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ గార్డెన్ ప్రాంతంలో పనిచేసే ఫోర్ మెన్, ఇతర అధికారులకు ఎప్పుడూ సహకరించరు. వారిలో వారికి సైతం మేము అంటే మేమే గొప్ప అన్న రీతిలో పనిచేస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించడం తప్ప పర్యాటకులకు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేసే వారు లేరనే అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఒక శాఖ ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే మరో శాఖ పర్మిషన్ తీసుకోవాలనే రీతిలో ఉండటంతో ఎన్నోసార్లు గొడవపడ్డారు. అభివృద్ధి పనులకు ఒకరంటే ఒకరు అడ్డంగా ఉంటున్నారని ఆరోపించుకోవడమే వారి పనిగా ఉండేది. ఇక యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత కూడా అధికారులు, సిబ్బంది మారకపోవడంతో ఆలయ ప్రాంగణాల్లో తరచుగా అసాంఘిక కార్యకలాపాలకు, అపవిత్ర పనులకు నిలయంగా మారాల్సి వస్తోంది.
Also Read : మేడారం జాతర పై మావోయిస్టు లేఖ కలకలం…
యునెస్కో గుర్తింపు రావడం ఇష్టం లేని వాళ్ళ పనేనా..?
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం ఇష్టం లేని కొందరు అధికారులు ఉన్నారని, వారే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది భక్తులు అభిప్రాయపడ్డారు. పురావస్తుశాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినవారు ఆలయంలోకి వచ్చే పర్యాటకులను కనీసం ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతించరని, అలాంటిది మాంసాహారం వండుతున్నా ఎందుకు పట్టించుకోలేదని పలువురు సందేహపడ్డారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులు, భక్తులను రామప్ప రామలింగేశ్వర స్వామి దర్శనానికి అనుమతిస్తారు. గతంలో ఇక్కడ పోలీస్ సిబ్బందిని రెండు శక్తులలో రాత్రిపూట సైతం ఆలయానికి రక్షణగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కాపలాగా ఉంచేవారు. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత కూడా ఆలయ పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉండడం పట్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తప్పించుకునే మా పరిధి కాదని తప్పించుకునే అధికారులే తప్ప పని చేయాలనే ఆలోచన లేని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీ, సస్పెండ్ చేయడం చేస్తే తప్ప ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు భక్తులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి
- కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ.. 17 ఎంపీ సీట్లకు 306 దరఖాస్తులు
- బాలికల ఆత్మహత్య ఘటన కేసులో కీలక మలుపు….
- కాంగ్రెస్ పార్టీలో విషాదం.. పెద్దపల్లి మాజీ MLA కన్నుమూత