క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఇవాళ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. రాజమల్లు మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజమల్లు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1989లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత 1994లో మరోసారి టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి గీట్ల ముకుందారెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో టీడీపీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)లో చేరాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇవి కూడా చదవండి :
One Comment